చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

-

శనివారం సాయంత్రం హైదరాబాద్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులు, ప్రజా సమస్యలపై వీరిద్దరూ చర్చించారని సమాచారం. గతంలో ఈ ఇద్దరు నేతలు రెండు సార్లు కలుసుకోగా.. వీరి మధ్య ఇది మూడవ భేటీ. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీరిద్దరూ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజాగా వీరి భేటీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బిజెపి రాష్ట్ర అధినేత సోము వీర్రాజు. టిడిపితో బిజెపి కలిసి వెళ్లడం అనేది జరగని పని అని.. బిజెపితో పొత్తు ఉందో లేదో జనసేన నే చెప్పాలని అన్నారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారో మాకు ఎలా తెలుస్తుందని అసహనం వ్యక్తం చేశారు సోము వీర్రాజు. ఆ భేటీ పై వారిద్దరే క్లారిటీ ఇవ్వాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news