విజయసాయి వెన్నెముకపై శాంతి కన్ను – ఏపీ మంత్రి సంచలనం

-

విజయ సాయి రెడ్డి, శాంతి వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి రెడ్డిని వైసీపీకి వెన్నెముకగా శాంతి ట్వీట్ లో తెలిపిందని గుర్తు చేశారు. ఆయన వెన్నెముక చూడాలని ఆమె ఎందుకు అనుకుందో తెలియదని విమర్శలు చేశారు. శాంతి పై వారం రోజుల్లో నివేదిక వస్తుందని వివరించారు.

నెల్లూరులో తెల్లరాయి అక్రమ తవ్వకాలపై విచారణ జరుగుతుందన్నారు. ఈ విషయంపై గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర తో కూడా చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో గట్టి చర్యలే తీసుకుంటుందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రస్తుతం రాజధాని పనుల నిధుల వ్యయం సైతం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం పనుల్లో జాప్యం చేసిందని, దాని వల్ల నిధులు కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని చెప్పారు. వేలకోట్ల నష్టం వచ్చేలా చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news