ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దన్నారు.. ఏపీ హోం మంత్రి !

-

ఈరోజు ఉదయం అనంతపురంలో ఎస్సైల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సంధర్భంగా సుచరిత మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామన్న ఆమె గృహహింస , అత్యాచారాలపై మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు.

దళితులపై దాడులు జరిగాయని చెప్పడం అవాస్తవం.. జరుగుతున్న వాటిపై వెంటనే స్పందిస్తున్నామని ఆమె అన్నారు. డిపార్ట్ మెంట్ కు చెందిన వారు తప్పు చేసినా చర్యలు తీసుకుంటున్నామని వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని వారికి ఎలాంటి అన్యాయం జరగదని మంత్రి అన్నారు. ఒకటి, రెండు సంఘటనలను ప్రతిపక్షాలు బూచిగా చూపుతున్నారని ఆమె అన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందని, కేసులను సత్వర్యం పూర్తి చేసేందుకు మూడు పోరెన్సిక్ ల్యాబరేటరీలను తిరుపతి, విశాఖపట్నం , విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news