టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు : మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

-

ఎన్నికల కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..టీడీపీ నేతలు మాదే ప్రభుత్వం..మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతల పై ఒక్క కేసు లేదు. ఈ రెండు నెలల్లో వైసీపీకి చెందిన 15 మంది పై దాడులు చేశారు.

రోడ్డు పై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారు.గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైఎస్సార్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారు. తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హత మార్చాలని చూశారు. వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి.టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి..కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ శ్రీనివాసరావును చంపాలని చూశారు. మరోవైపు  మేము దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు..శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news