జగన్ తిరుమల పర్యటన.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్ట్ !

-

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టిడిపి నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుమలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా తిరుపతిలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు టిడిపి నాయకులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు. చిత్తూరులో జిల్లా టిడిపి అధ్యక్షులు పులివర్తి నాని ,ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి , అనూష రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మని కూడా హౌస్ అరెస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున్న సుగుణమ్మ ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచే సుగుణమ్మ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించినట్టు చేబుతింది. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను తెలుగుదేశం నేతలు అడ్డుకుంటారని ప్రచారంతో పోలీసుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలు హౌస్ అరెస్ట్ లు సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news