అమిత్ షాతో అయిపోయిన జగన్ రెండో సిట్టింగ్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆయన వరుసగా రెండు రోజుల్లో రెండు సార్లు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఇక కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా జగన్ సమావేశం అయ్యారు. ఇక తాజాగా అమిత్ షా తో ఆయన రెండో భేటీ కూడా ముగిసింది. నిన్న ఏకాంతంగా అమిత్ షా ని జగన్ కలిసారు.

నేడు మాత్రం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్సభ పార్టీ నేత మిథున్ రెడ్డితో వెళ్లి కలిసారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎం చర్చించారు అనే దానిపై స్పష్టత లేదు. కాగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news