ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం

-

విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుతో సోషల్‌ మీడియాలో ట్వీట్లు కలకలం రేపాయి. నిన్న చంద్రబాబు దిల్లీ పర్యటనను ఉద్దేశించి కేశినేని నాని ఎద్దేవా చేస్తున్నట్టుగా ట్వీట్లు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ ట్వీట్లు ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎంపీ కార్యాలయం ఖండించింది.

ఎంపీ నానికి సంబంధం లేకుండానే ఫొటో, పేరుతో నకిలీ అకౌంట్‌ క్రియేట్‌ చేసినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించింది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news