టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది : కేశినేని నాని

-

కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ఎన్నికల తరువాత ఈవీఎంలు ఓపెన్ చేసిన తరువాత మాట్లాడుతానన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవద్దని.. గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని.. నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అన్నారు. 

రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తరువాతనే వైఎస్సార్సీపీ చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్ సీపీలో చేరినట్టు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానన్నారు. రాజకీయాల్లో తన స్థాయి.. చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్ తనకంటే చాలా తక్కువన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news