BREAKING : నందికొట్కూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత

-

నంద్యాలలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో రేపు చంద్రబాబు పర్యటించనున్న సంగతి తెలిసిందే. నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ప్రాజెక్ట్, బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శన కోసం చంద్రబాబు నాయుడు రానున్నారు.

ఈ తరుణంలోనే..ప్రాజెక్టులను సందర్శించే అర్హత చంద్రబాబుకు లేదంటున్నారు వైసీపీ సీనియర్ నేత, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి. ప్రాజెక్టులను ఎలా సందర్శిస్తారో.. తాను చూస్తానంటూ లబ్బి వెంకటస్వామి హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటుని వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు పర్యటనను తన అనుచరులతో అడ్డుకునేందుకు ఇప్పటికే స్కెచ్‌ లు వేశారు. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news