బ్లాక్ కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్ – స్పీకర్ తమ్మినేని

-

“బ్లాక్ కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్. వారున్నారనే ధైర్యంతో చంద్రబాబు రెచ్చిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని. ఎవరిని ఉద్ధరించేందుకు బ్లాక్ కమాండోలు? నేను కేంద్ర ప్రభుత్వానికి స్పీకర్ గా అప్పీల్ చేస్తున్నా. ఏ అర్హతతో చంద్రబాబుకి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారని వెల్లడించారు. దేశంలో ఎంతోమందికి థ్రెటనింగ్ ఉంది.

వాళ్ళందరికీ ఇలానే భద్రత ఇచ్చారా? ఈయన ఏమైనా వ్యవస్థకు అతీతుడా?” అని స్పీకర్ తమ్మినేని అన్నారు. సోమవారం ఆముదాల వలస నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్పీకర్ మాట్లాడారు. “మూడు దఫాలుగా సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని అసమర్ధుడు, అవినీతిపరుడు. పౌరుషం, సిగ్గు, లజ్జ, ఎగ్గు, మానం, అభిమానం, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు” అని రాఘవులు కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news