చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి – మల్లాది విష్ణు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణం పై విచారణ చేపట్టామన్నారు. కానీ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారని.. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ మధ్యనే విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేసిందని తెలిపారు.

చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు మల్లాది విష్ణు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని లూటీ చేస్తే విచారణ సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపు ఎలా అవుతుందన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని.. ఇందులో ఇంకా కొంత మంది పేర్లు బయటకు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news