నవ మోసాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – యనమల

-

అమరావతి: టీడీపీ మినీ మేనిఫెస్టో జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టని అన్నారు ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. నవమోసాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం టీడీపీ అజెండా అని.. దోపిడీ కోసం అప్పులు జగన్ అజెండా అని ఎద్దేవా చేశారు. మహాశక్తి పథకంతో మహిళా శక్తి మహా శక్తిగా మారబోతోందన్నారు యనమల. గతంలో డ్వాక్రాను ప్రారంభించి మహిళాభివృద్ధి చేసి చూపింది చంద్రన్నేనని అన్నారు.

yanamala ramakrishnudu

స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికీ ఏటా రూ.15వేలు అందిస్తామన్నారు. నెలకు రూ.1500 ఆర్ధిక ప్రోత్సాహం అందించి గౌరవిస్తామన్నారు. గతంలో దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత చంద్రన్నదేనని గుర్తు చేశారు. చంద్రబాబు విజన్ 2020తో నాడు సృష్టించిన సంపద.. నేడు హైదరాబాద్ నగరాన్ని, డ్వాక్రా వ్యవస్థతో మహిళల్ని ప్రపంచ పటంలో నిలిపింది చంద్రన్నేనని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు విజన్ 2047 రూపొందించారని వివరించారు. సంపద సృష్టించి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా కలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు యనమల రామకృష్ణుడు.

Read more RELATED
Recommended to you

Latest news