స్టూడెంట్ అలర్ట్: జూన్ 2 నుండి టెన్త్ సప్లమెంటరీ…

-

ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్షలలో కొందరు ఫెయిల్ అయ్యారు, ఈ విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పరీక్షకు ఫలితాలు ప్రకటించిన రోజునే ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. అదే షెడ్యూల్ ప్రకారం సప్లమెంటరీ పరీక్షలు 2 జూన్ నుండి 10 జూన్ వరకు జరపనున్నట్లు కన్వీనర్ దేవానంద్ రెడ్డి ఒక ప్రకటనలో భాగంగా తెలియచేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 .45 గంటల నుండి 12 .45 గంటల వరకు సమయాన్ని నిర్ణయించారు. నియమనిబంధనల ప్రకారం పరీక్ష సమయానికి కనీసం నిముషాల ముందు పరీక్ష హాల్ లోనికి రావలెను అని తెలిపారు.

ఇప్పటి వరకు అందిన అప్లికేషన్ ల ప్రకారం ఈ పరీక్షకు అప్లై చేసుకున్న వారి సంఖ్య 212222 గా ఉంది. ఇంకా హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకొని వారు వెంటనే వెబ్ సైట్ నుండి చేసుకోగలరని విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news