ఏపీలో విషాదం..నీటి సంపులో పడి ముగ్గురు మృతి

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు చౌడేపల్లి మండలం పెడ్డకొండామారి లో ఈ విషాదం చోటు చేసుకుంది. నీటి సంపు లోకి దిగి ప్రమాదవశాత్తు ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ తరుణంలోనే.. చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…..సంపులో పడి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. వారి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని.. మృతుల కుటుంబాలకు పరిహారం కింద ఐదు లక్షలు, వైఎస్సార్ భీమా కింద మరో ఐదు లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news