ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని… రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news