తిరుమల వెళ్లే భక్తులకు షాక్‌..ఇవాళ్టి నుంచి ఆ సేవలు రద్దు !

-

తిరుమల వెళ్లే భక్తులకు షాక్‌..ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. ఇక రేపు స్వర్ణరథం పై మాడవీధులలో ఉరేగనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిగా దర్శనం ఇస్తారు.

ఈ తరుణంలోనే… ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. కాగా, తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 31 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 09 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news