BREAKING : ఘోర ప్రమాదం.. ట్రాలీ వ్యాన్ ను ఢీ కొట్టడంతో 9మంది మృతి

-

రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రాలీ అదుపు తప్పి వ్యాన్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఝలావర్ జిల్లాలోని అకలేరాలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లో ఓ వివాహ వేడకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యుల చేపట్టారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో 9 మంది మరణించారని పోలీసులు ధ్రువీకరించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే మితి మీరిన వేగంతో రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news