TTD: సెప్టెంబర్ 27 నుంచి అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు – టీటీడీ ఈవో

-

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పై ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కరోనా కారణంగా రెండేళ్లపాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు. ఈ ఏడాది యధావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామి వారు విహరించేలా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 1న గరుడసేవ, 2 న బంగారు రథం, 4 న మహారథం, 5 న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని వివరించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి సెప్టెంబర్ 27న పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news