నార్సింగీలో దారుణం…ప్రియురాలిని కత్తి తో పొడిచిన ప్రేమికుడు

-

నార్సింగీలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని కత్తి తో పొడిచాడు ఓ ప్రేమికుడు. దీంఓ ఆ మహిళ కు మెడపై, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రియురాలికి తీవ్ర గాయాలు కావడంతో… హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

మాట్లాడాలని నార్సింగీ టీ గ్రీల్ హోటల్ వద్దకు పిలిపించిన యువకుడు…ఈ తరుణంలోనే కత్తితో దాడి చేశాడు. ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, ఒక్కసారిగా బ్యాగ్ లో ఉన్న కత్తితో పొడిచి పారిపోయాడు ప్రియుడు.బాధితురాలు వాసవీ గా గుర్తించారు పోలీసులు. ఆంద్రప్రదేశ్ పిడుగురాళ్లకు చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. అటు గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన గణేష్ గా నిందితున్ని గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news