వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

-

ఏపీలో కరోనా కేసులు ఎంత మాత్రమూ తగ్గడం లేదు. ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతానికి కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నా అవి గతంతో పోలిస్తే తక్కువే కానీ ఓవరాల్ గా అయితే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇక ఏపీలో వరుసగా ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ ఉదయం నిర్వహించిన పరీక్షలలో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో 14 రోజుల హోమ్ క్వరంటీన్ లో ఉండాలని వైద్యుల సూచన మేరకు ఆయన క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. తనతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిన అందరినీ టెస్ట్ చేయిన్చుకోవలసిందిగా ఆయన కోరారు. ఇక ఆయన మొన్న జగన్ దుర్గ గుడి పర్యటన సమయంలో కూడా ఆయన వెంటనే ఉన్నారు. కొడాలి నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలతో ఆయన సన్నిహితంగా మాస్కులు లేకుంగా మెలగడం కూడా టీవీలలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news