త్వరలో విశాఖ నుంచే ‘వందే భారత్’ రైలు ప్రారంభం

-

ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో ‘వందే భారత్’ రైలు ప్రారంభం కానుంది. అత్యాధునిక వసతులతో కూడిన ‘వందే భారత్’ రైలు విశాఖ నుంచి రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు వాల్తేరు డిఆర్ఎమ్ అనూప్ సత్పతి తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ట్రాక్ ల సామర్థ్యం వందే భారత్ ట్రైన్ వేగానికి సరిపోతుందని తెలిపారు. ఒకసారి ప్రయోగాత్మక పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుందన్న దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. విశాఖ నుంచి తిరుపతి లేదా విజయవాడకు ఉండొచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news