సంక్షేమానికి పెద్ద పీట‌..!

-

సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్న త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. గుంటూరులోని క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌ కి బుధ‌వారం నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి అంద‌జేయాల్సిందిగా కోరుతూ న‌గ‌దు చెక్కుల‌ను ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప‌లువురు దాత‌లు త‌మ‌కు తోచిన సాయం అంద‌జేశార‌ని తెలిపారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో కూలీలు సైతం కొంత కూడ‌బెట్టుకుని ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం ఇచ్చార‌ని తెలిపారు. క‌రోనా ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచేందుకు చాలా మంది ముందుకువ‌చ్చి తోచిన ఆర్థిక సాయం చేస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురు నుంచి అందుకున్న చెక్కుల‌ను ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని క‌లెక్ట‌ర్‌కు అంద‌జేశారు.

Read more RELATED
Recommended to you

Latest news