కొత్త ఛానల్‌ పెడుతున్న విజయసాయిరెడ్డి !

-

కొత్త ఛానల్‌ పెడుతున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. శాంతి వివాదంపై విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ…త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని వెల్లడించారు. గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానని… ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటు లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కులాలికి, మతాలికి, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూట్రల్ ప్లాట్ ఫార్మ్ మీద పని చేస్తుంది…..తప్పులు చేసే వాళ్ళను వదలమన్నారు.

YSRCP Vijayasai Reddy

ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అస్తుల రక్షణ కోసం పనిచేశాను…ఎటువంటి చర్యలకు అయిన సిద్ధమని వెల్లడించారు. టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై మా పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారు…..అయినా నేను బాధపడలేదన్నారు. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదు…తప్పు చేయను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని వెల్లడించారు. మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని నిప్పులు చెరిగారు. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news