షేమ్.. షేమ్.. బాబూ : చంద్రబాబుకి విజయసాయిరెడ్డి కౌంటర్..!

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. బట్టలు విడిచిన మూర్ఖపు రాజు తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించడం లేదనుకున్నాడట! అంటూ ఎద్దేవా చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో ఓడిపోయిన బాబు, చివరికి కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు 13 జిల్లాలను తానే అభివృద్ధి చేశానంటూ ఏవేవో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని ఫైరయ్యారు. షేమ్.. షేమ్.. బాబూ.. అంటూ ట్వీట్ చేశారు.

కాగా, అంతకుముందు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 13 జిల్లాలను తామే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రహదారులు, విద్యుత్ సహా అనేక రంగాల్లో సమస్యలు అధిగమించామని, సమగ్రాభివృద్ధికి నాంది పలికినట్టు చెప్పారు. అలాగే ఈ 14 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. మూర్ఖపు రాజు అంటూ చంద్రబాబుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news