దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా..!

-

విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తిరనున్నాయి.. ఎంతగానో ఎదురుచూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తాజాగా.. ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో సంతాప దినాలు కొనసాగుతున్నందున ప్రారంభం వాయిదా పడింది. ఈనెల 4న ఫ్లై ఓవర్ ప్రారంభించాలని గతంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రణబ్ మృతితో ప్రారంభం వాయిదా పడింది.

ఈనెల 7 లేదా 8న ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభమైతే హైద్రాబాద్ నుండి విజయవాడ నగరంలోకి రావడానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇకపోతే గత నెల 10వ తేదీన అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరాడు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆగష్టు 31వ తేదీ సాయంత్రం మరణించాడు. ప్రణబ్ ముఖర్జీ మృతితో కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 31 తేదీ నుండి 6వ తేదీ వరకు సంతాప దినాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news