ఆ గట్టునుంటావా…లేదా ఈ గట్టునుంటావా నారాన్న ? : చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

-

ఆ గట్టునుంటావా…లేదా ఈ గట్టునుంటావా నారాన్న ? అంటూ నారా చంద్రబాబు నాయుడి పై విజయ సాయిరెడ్డి సెటైర్లు విసిరారు. ఆ గట్టునున్నావా తుప్పన్నా… ఈ గట్టునున్నావా పప్పన్నా… ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు.. ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు… మరి ఏ గట్టునుంటావు నారన్న! ఏ గట్టునైనా ఉన్నావో లేదో… కరకట్టనున్నావు నారన్నా! అంటూ నారా చంద్రబాబుకు చురకలు అంటించారు విజయసాయి.

ఇక మరో ట్వీట్‌ లో… విగ్గు, పెగ్గు అనే బ్యాంకు దొంగ…ఒక నికృష్టుడు దుర్గంధం వెదజల్లే కుళ్లిన శవంలాంటి వాడు. దేహం పగుళ్లుబారి రసికారుతోంది. దానిని పురుగులు తినేదాక మనం కాస్త దూరంగా ఉండక తప్పదని హెచ్చరించారు. రోడ్ల నిర్మాణంపై జగన్ గారి ప్రభుత్వం ఏడాది కాలంలో 3,590 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బాబు హయాంలో వేల కోట్లు ప్రకటించినా విడుదల అయ్యేవి కాదు. ఎల్లో మీడియాకు ఇవేవి కనిపించవు. మారుమూల రోడ్ల ఫోటోలను చూపించి ప్రధాన రహదారులన్నట్టు బోగస్ రాతలు రాస్తోందని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news