సీఎం జగన్ తో విశాఖ ఎంపీ భేటీ

-

విశాఖపట్నంలో ఎంపీ ఏంవీవీ కుటుంబ సభ్యులు, ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ డబ్బు కోసమే జరిగిందని ఇప్పటికే పోలీసులు తేల్చి చెప్పారు. ఎంపీ కూడా రౌడీషీటర్ పక్కా ప్లాన్ చేసి తన కుటుంబ సభ్యులను బంధించారని అంటున్నారు. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు తో పాటు ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు కిడ్నాప్ కి గురయ్యారు. కోటి 75 లక్షలు ఇచ్చినా 20 కోట్ల కోసం పట్టుబట్టారని ఎంపీ అంటున్నారు.

అయితే ఈ కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీకానున్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఆడిటర్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమై కిడ్నాప్ జరిగిన తీరు, అనంతర పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news