BREAKING : విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భద్రత పెంపు…

-

BREAKING : విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భద్రత పెంచారు. ప్రస్తుతం ఉన్న పీఎస్ ఓలకు అదనంగా మరో ఇద్దరు కేటాయించింది ఏపీ సర్కార్‌. ఇక నుంచి ఎంపీకి 2+2 గన్ మెన్ల రక్షణ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఎంపీ కుమారుడు శరత్ కు ఇద్దరు గన్ మెన్లను కేటాయించిన ప్రభుత్వం… ఆడిటర్ జీవీకి రక్షణ అవసరమని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో జీవీకి 1+1 సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. పెంచిన భద్రతకు అనుగుణంగా విధుల్లో చేరింది సిబ్బంది. కిడ్నాప్ తర్వాత ఎంవీవీతో పాటు కుంటుంబ సభ్యులు, జీవీకి రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి నివేదన పంపాయి నిఘా వర్గాలు. ఈ తరుణంలోనే విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భద్రత పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news