మందు బాబులకు షాక్‌.. మూడు రోజులు వైన్స్‌లు బంద్

-

ఏపీ మందు బాబులకు బిగ్‌ షాక్‌. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ నెల 11 ,12 ,13 తేదీల్లో మద్యం షాప్ లు బంద్ కానున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ నెల 13న జరగనున్న నేపథ్యంలో 11వ తేదీ సా.4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం షాపులు, బార్లు,టూరిజం బార్స్, మద్యం డిపాలను ముసివేయనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం షాపులు ముసివేయనున్నారు.

కాగా, ఈ ఎన్నికల కు సంబంధించి అధికార వైసిపి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీ-ఫారాలు అందజేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ని కలిశారు. వారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news