నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం – దేవినేని అవినాష్

-

విజయవాడ: నేడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తనయుడు దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఒక్కసారి మంత్రిగా పని చేసి నెహ్రు పేద ప్రజలకి సేవలు చేశారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి చాలా మందినీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన ఘనత నెహ్రుదని అన్నారు.

విజయవాడ, కృష్ణాజిల్లా అభివృద్ధిలో నెహ్రూ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. ఎన్టీఆర్, వైయస్సార్ లాంటి నేతలతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ నగరాభివృద్ధికి నెహ్రు కృషీ చేశారని తెలిపారు. అయన తనయుడిగా పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నెహ్రు ఆశయ సాధనకు చిత్తశుద్ది తో కృషీ చేస్తున్నామన్నారు అవినాష్. నెహ్రు ట్రస్ట్ స్థాపించి అయన పేరుతో సేవ కార్యక్రమాలూ చేస్తున్నామన్నారు. భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమలు చేపట్టి పేదలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news