జగన్‌ దావోస్‌ పర్యటన రహస్యం ఏంటి..నల్లధనం తరలింపుకేనా : యనమల

-

సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా అనే అనుమానాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. సీఎం జగన్ ఆ అననమానాలు నివృత్తి చేయాలని.. 3 ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అని ప్రశ్నించారు.


అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండనులో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందని తెలిపారు. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? ఏ దేశ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు..? ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది..? అని ప్రశ్నించారు.

లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా..? దావోస్ కు వెళ్లడానికి మాత్రమే అనుమతించిందా..? 14 కేసుల్లో ముద్దాయిగా వున్న ఏ1 నిందితుడైన చరిత్ర జగన్ ది… జగన్ గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమేనన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల.

Read more RELATED
Recommended to you

Latest news