వంగవీటి రాధా పై వైసీపీ ఫోకస్..!

-

ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చేందుకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని నిన్న సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలని, బందరు ఎంపీ సీటు రెడీగా ఉందని ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.  ఇదిలా ఉండగా.. వైసీపీలో చేరికపై రాధా నుంచి క్లారిటీ రాలేదని సమాచారం. గతంలోనే రాధా వైసీపీలో చేరాలని పలు సమావేశాలు జరిపారు వైసీపీ కీలక నేతలు. టీడీపీ నుంచే రాధాకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్టు రాధా వర్గం చెబుతోంది. రాధాకి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగిన బెజవాడ సెంట్రల్, ఈస్ట్ టికెట్లను ఇప్పటికే చంద్రబాబు అనౌన్స్ చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news