జేపీ నడ్డా గురించి మాట్లాడే స్థాయి వైసీపీ నాయకులకు లేదు – సోము వీర్రాజు

-

వైసిపి నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురించి మాట్లాడే స్థాయి వైసీపీ నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీలో భూమాఫియా ఎక్కువైందని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగున ఇసుక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

తమ ప్రాంతంలో 150 కోట్ల భూ మాఫియా జరిగిందని, లిక్కర్, భూమాఫియాలు జరగడం లేదా..? అని ప్రశ్నించారు. ఇసుక దోపిడీ ఎవరి జేబుల్లోకి వెళుతోంది..? మేము ఇచ్చిన డబ్బులలో మీ దోపిడీ కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి 9 సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సోము. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంటే.. ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందన్నారు. అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news