వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధికి అస్వస్థత

-

మాజీమంత్రి, పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే పార్థసారధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యంతో పడిపోవడంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన అశోక్ నగర్ లోని టాప్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పార్థసారధికి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news