నేను ఆత్మహత్య చేసుకుంటా : పూజారి సాయికృష్ణ

-

అప్సరను హత్య చేసిన పూజారి సాయికృష్ణ నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటా. జైలుకు వెళ్లిన బతకను. అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేకపోతే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించింది’ అని విలపిస్తూ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, అతడికి రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక అటు శంషాబాద్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ భార్య శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్సర టార్చర్ వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చు. నా భర్త తన మంచితనం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. కావాలనే ఆయనను ట్రాప్ చేశారు. యాక్సిడెంటల్ గా హత్య జరిగి ఉండొచ్చు. నా భర్త వల్లే ఆమెకు గర్భం రాకపోయి ఉండొచ్చు. అయినా అప్సర లేట్ నైట్ ఇంటికి వస్తుంటే కుటుంబీకులు ఏం చేస్తున్నారు?’ అని శ్రావణి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news