కాకినాడ నుంచి ఏచూరి.. నగరి నుంచి నారాయణ పోటీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో జరిగబోయే ఎన్నికల్లో వామపక్ష నేతల పోటీ పై మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ లోక్ సభ నుంచి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఏపీలో సైతం పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తుంది. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. కాపులకు ఇదే మంచి అవకాశం అని సూచించారు. మరోసారి తిరుపతి నుంచి పోటీ చేస్తే.. సీఎం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news