వైయస్ జగన్ అప్పుడు పెట్టిన ముద్దులే ఇప్పుడు పిడి గుద్దులు – చంద్రబాబు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ముంపు బాధితులని పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇక్కడికి వచ్చింది వరద బాధితులను పరామర్శించడానికి అని, కానీ ఇక్కడికి వచ్చి రెండు రోజులు పర్యటించిన తర్వాత తనకు ఒక విషయం తెలిసిందన్నారు. మన రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, పేదల వ్యతిరేక పాలన ఉందన్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే పది హెలిక్యాప్టర్లతో జగన్ పర్యటించాడని, ఇక్కడికి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళాడని మండిపడ్డారు.

నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు

పేదవాళ్ల కష్టాలను పట్టించుకున్న పాపాన వీళ్ళు పోలేదని, ఈ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి కాదు, అప్పుడు పెట్టిన ముద్దులే.. ఇప్పుడు పిడి గుద్దులు అంటూ ఎద్దేవా చేశారు. పేదవాళ్ల కన్నీరు తుడిచేవాడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ.. కంటనీరు పెట్టించేవాడు ముఖ్యమంత్రి కాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news