వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అదే: రేవంత్ రెడ్డి

-

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైయస్సార్ అని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే వైయస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుంది అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాదులో వైఎస్ స్మృతీ వనాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ చేయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాదులో వైయస్సార్ స్మృతివనం నిర్మిస్తామని తెలిపారు. వైయస్సార్ ఆలోచనలను తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ అత్యంత విశ్వాసపాత్రుడు అని అన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మడమ తిప్పని నేత రాజశేఖరరెడ్డి అని, వైయస్సార్ మనమధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news