చంద్రబాబు నెల రోజుల పాలనపై షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు

-

చంద్రబాబు నెల రోజుల పాలనపై షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది… సూపర్ సిక్స్ ను ఎందుకు అమలు చేయటం లేదో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారన్నారు.

ys sharmila on chandrababu palana

చంద్రబాబు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకి ఎక్కువ మందికి ఉపయోగపడే పథకం ఇది అన్నారు. అమ్మకు వందనం పథకంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ 15 వేలు ఇస్తామని చెప్పారు… జీఓ లో ఒక తల్లికి 15 వేలు ఇస్తారని ఉందని ఫైర్‌ అయ్యారు.
దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి.. ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తున్నారా, ప్రతి తల్లికీ 15 వేలు ఇస్తున్నారా అనేది చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో జగన్ కూడా ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకు 15 వేలు మాత్రమే ఇచ్చారు… ఎన్నికల సమయంలో నేను కూడా ఇలానే ప్రచారం చేశానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news