తెలంగాణలో ముందుగానే ఎన్నికలు – విజయమ్మ

-

తెలంగాణ రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు వస్తాయని వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ…మీ అందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి సజీవంగా ఉన్నారన్నారు. ప్రజల అభిమానం నుంచి వైసీపీ పార్టీ పుట్టిందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని… పార్టీ అంటేనే ప్రజల అభిమానం అని వివరించారు.

జగన్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారని… మా కుటుంబం అనేక నిందలు భరించిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ. తాను వైసిపి నుంచి తాను తప్పుకుంటున్నట్లు విజయమ్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని… నేను అండగా ఉండాలన్నారు. తండ్రి ఆశయాలు కోసం షర్మిల ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ లో షర్మిల గడ్డి ప్రయత్నం చేస్తుందని విజయమ్మ వివరించారు. జగన్ కోసం వైయస్ షర్మిల… పాదయాత్ర చేసిందని… కానీ కొంతమంది తమ కుటుంబం పై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు విజయమ్మ. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి లేని లోటును తెలంగాణలో వైఎస్‌ షర్మిల, ఇక్కడ ఏపీలో జగన్‌ తీర్చుతారని చెప్పారు విజయమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news