ఏపీ రైతులకు శుభవార్త..రేపు YSR రైతు భరోసా నిధులు విడుదల

-

 

ఏపీ రైతులకు శుభవార్త..జూన్ 1వ తేదీన అంటే రేపే కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి రూ. 7,500 చొప్పున రూ. 3,934 కోట్లను బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు.

అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందించనున్నారు. కాగా, ఇక రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.

భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం ఇప్పటికే ఇచ్చింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news