వైసీపీ ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

-

వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఆయన కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు స్వల్పంగా ధ్వంసమవ్వగా, మోపిదేవి తృటిలో బయటపడ్డారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి మోపిదేవి తన కుటుంబ సభ్యులతో సహా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా మోపిదేవి ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతినడంతో అటు పక్క వెళ్తున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తన కారును ఆపి ఆయనను పరామర్శించారు. అనంతరం ఆమె మోపిదేవిని తన కారులో ఎక్కించుకుని విశాఖపట్నం వైపు బయలుదేరి వెళ్లారు. సమాచారం అనుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేసరుకున్నారు. కాగా, ఈ ఘటనతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news