ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్.. తెరపైకి ఇజ్రాయెల్!

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సరి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల ఫారిన్ టూర్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వీరు ఏ దేశానికీ వెళ్లారు,ఎలాంటి వీసాను పొందారు, ఎందుకు వెళ్లారు, ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు వంటి విషయాలపై పూర్తి వివరాలు సేకరించారు. దీంట్లో భాగంగానే ఇటీవల నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ వాడకంపై శిక్షణ పొందేందుకు ఇజ్రాయిల్ వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేసారని తెలుస్తోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ టార్గెట్ ప్రకారమే ఓ ప్రణాళిక బద్దంగా సాగించారని పోలీసు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news