సరూర్ నగర్ కిడ్నాప్ కేసులో మరో కీలక ట్విస్ట్.. నరబలి ఇచ్చేందుకు ప్రయత్నం !

-

హైదరాబాదులోని సరూర్ నగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. పిఎన్టి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడిని కొందరు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వెంటనే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి సుబ్రహ్మణ్యం ను పోలీసులు రక్షించారు. తాజాగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలను వెల్లడించాడు. “గురువారం రాత్రి ఇంట్లోకి వెళుతుండగా నన్ను కొట్టి కార్లో ఎక్కించుకొని తీసుకొని పోయారు. కారులో వెళ్ళేటప్పుడే నన్ను చిత్రహింసలకు గురి చేశారు. చింతపల్లి వద్ద ఉన్న ఒక శివాలయం దగ్గరికి తీసుకెళ్లి నన్ను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.

గంజాయి తాగి ఆ సిగరెట్లతో నా ఒంటిపై కాల్చారు. నన్ను నరబలి చేస్తామని స్నానం చేసి రావాలని పంపించారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండగా ఎస్ఓటి టీం వచ్చి నన్ను కాపాడారు. కార్పొరేటర్ కి ఎదురు వెళ్లడంతో పాటు మా బాబాయితో ఉన్న ఆస్తి తగాదాల విషయంలో కిడ్నాప్ చేశామని చెప్పారు. మొత్తం 12 మంది కలిసి నన్ను కొట్టారు కొట్టారు. నేను నా తండ్రి కలిసి ఓ మైనర్ బాలికను రేప్ చేశామని ఒప్పుకోవాలంటూ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోలన్నీ పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు.” అంటూ సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news