కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం

-

తెరాస శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస ఎల్పీ భేటీ అయింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నిక, తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇటీవల మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల రైతు నేతలతో జరిగిన చర్చల సారాంశం.. నిర్ణయాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వివరిస్తున్నారు. బిహార్ పర్యటన, వివిధ రాష్ట్రాల నేతలతో చర్చలు, వామపక్షాలతో కలిసి పనిచేయడం వంటి అంశాలపై కేసీఆర్ నేతలతో చర్చిస్తున్నారు . తెలంగాణ ప్రాంతం భారత్‌లో కలిసి 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో.. విలీన దిన వజ్రోత్సవాలు, రైతాంగ సాయుధ పోరాటాలను గుర్తు చేసుకునేలా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news