చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమా నుండి మరో లుక్ విడుదల..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు నటిస్తున్న సినిమా ” చావు కబురు చల్లగా “. ఇక ఈ సినిమాకు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాని నిర్మాతగా వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తి బాల రాజు పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవలే కార్తికేయ లుక్ లో ఓ పోస్టర్ రిలీజ్ విడుదల చేసింది చిత్రబృందం దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో మల్లిక అనే పాత్ర పోషిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ లో లావణ్య త్రిపాటి చాలా సింపుల్ గా శిలువ లాకెట్ మెడలో వేసుకుని, దినిగా పెట్టిన మొకంతో ఎదో ఆలోచిస్తునట్లుగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news