ఇండస్ట్రీలోకి మరో కొత్త దర్శకురాలు.. సక్సెస్ అవుతుందా..?

-

సినీ ఇండస్ట్రీలోని 24 ఫ్రేమ్స్ లో ఒకదాని నుంచి మరొకదానిలోకి ప్రతి ఒక్కరూ షిఫ్ట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోబోతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన టెక్నీషియన్ నీరజ కోన ఇప్పుడు ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టబోతోంది. బాద్ షా సినిమాలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే కెరియర్ మొదలుపెట్టింది. ఈ సినిమాలో వారిద్దరి లుక్స్ చాలా స్టైలిష్ గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక అదే ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది నీరజ. ఈ సినిమాలో కూడా తన వర్క్తో అందరినీ ఆకట్టుకోవడంతో పలు అవకాశాలు వచ్చాయి. అలా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, సమంత, కాజల్ వంటి స్టార్స్ అందరికీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అంతేకాదు తమన్ దర్శకత్వంలో వచ్చిన తిక్క, చల్ మోహనరంగ, మిస్ ఇండియా సినిమాలో పాటలకు లిరిక్స్ అందించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.

తమిళ స్టార్ సినిమా ఆటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ తో కలిసి నీరజాకోన ఈ ప్రాజెక్టు చేయబోతోంది. ఈ విషయాన్ని శ్రీరామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. మిథున్ చైతన్య ఈ సినిమాకి కథని అందించబోతున్నారు . ఇకపోతే కాస్ట్యూమ్ డిజైనర్ గా, లిరిక్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నీరజ దర్శకురాలిగా ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by PC Sreeram Isc (@pcsreeram.isc)

Read more RELATED
Recommended to you

Latest news