కట్టప్పను ఎవరు చంపారు ? : జగన్‌ పై ఆర్జీవీ మరో సంచలన ట్వీట్‌ !

-

జగన్‌ సర్కార్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల ధరల వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే.. తాజాగా జగన్‌ సర్కార్‌ పై మరో సంచలన ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ జగన్‌ సర్కార్‌ పై మండిపడ్డారు వర్మ. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారని….. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ ఆర్‌ఆర్‌ఆర్‌ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోందన్నారు.

కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుందని… “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. కాగా… నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు ఆర్జీవీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలపైనే వీరిద్దరూ చర్చించారు. కానీ.. ఈ వివాదానికి ఇంకా ఫుల్‌ స్టాప్‌ పడలేదు. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news