ఏపీలో తగ్గిన కరోనా : గడచిన 24 గంటల్లో 624 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరుణ కేసులు నిలకడ లేకుండా ఒక రోజుకు పెరుగుతూ… మరొకరోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 624 కరోనా కేసులు నమోదయ్యాయి.

ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,57, 252 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7944 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో 04 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,254 కి చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 810 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,35, 054 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38, 312 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 87, 44 , 941 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news