ఢిల్లీలో జ‌గ‌న్‌కు దొర‌క‌ని అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌..

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే కేంద్రమంత్రిని అమిత్‌షాను జగన్ కలవడానికి ఢిల్లీ వెళ్లారు. కానీ.. అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ అమిత్‌ షా దర్శనం లభించలేదు.

జగన్‌ సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్‌ షా పిలుపుకోసం ఎదురు చూస్తూ… 1 జన్‌పథ్‌లోని తన అధికార నివాసానికే రోజంతా పరిమితమయ్యారు. కానీ… షా నుంచి కబురు రాలేదు. అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌ మంగళవారానికి వాయిదా పడిందని ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news